ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ఎంఫసిస్ హైదరాబాద్లోని రాయదుర్గంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసింది.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సెప్టెంబర్ 27న ప్రారంభించారు.
ఈ నూతన సెంటర్తో హైదరాబాద్లో ఎంఫసిస్ ఆఫీసుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.