ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటైన పోక్సో కోర్టు (ప్రత్యేక న్యాయస్థానం)ను ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ అక్టోబర్ 2న ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఏపీకి ఎనిమిది పోక్సో కోర్టులు మంజూరయ్యాయని..
కృష్ణా జిల్లాకు ఒకటి మంజూరైనట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో నమోదయ్యే మైనర్ బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల విచారణ పోక్సో కోర్టులో జరుగుతుందన్నారు.