దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్
దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు ‘తేజస్ ఎక్స్ప్రెస్’ అక్టోబర్ 4న ప్రారంభమైంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే తొలి ప్రైవేటు రైలు 'తేజస్ ఎక్స్ప్రెస్'ను ప్రారంభించారు.
లక్నో-న్యూఢిల్లీ మధ్య నడిచే ఈ ప్రైవేట్ రైలును రైల్వేశాఖ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) నిర్వహిస్తోంది.
ఈ తేజస్ 6.15 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఈ రైలుకు కాన్పూర్, ఘజియాబాద్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. మంగళవారం మినహా ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంది.
ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున పరిహారం చెల్లించడం జరుగుతుంది.
ఇందులో ప్రయాణించే ప్రయాణికులకు రూ. 25లక్షల ఉచిత బీమా సౌకర్యం కూడా ఉంది.