146 కొత్త 108 అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం జగన్

146 కొత్త 108 అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరికొత్తగా 146... 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ కొత్త అంబులెన్స్‌ లను సీఎం వైఎస్ జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం దగ్గర ప్రారంభించారు. 2020లో ఏపీ ప్రభుత్వం రూ.96.50 కోట్లతో 412 అంబులెన్స్‌లు కొంది. అలాగే అప్పటికి ఉన్న వారికి రిపేర్లు చేయించింది. తద్వారా వాటి సంఖ్య 748కి పెరిగింది. 2022లో అక్టోబర్‌లో గిరిజన ప్రాంతాల కోసం మరో 20 అంబులెన్స్‌లను కొంది. తద్వారా మొత్తం అంబులెన్స్‌ల సంఖ్య 768కి పెరిగింది. ఇప్పుడు కొత్త వాటితో కలిపి ఈ సంఖ్య 914కి చేరింది. ఫలితంగా రాష్ట్రంలో ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ ఉంది అని అంటున్నారు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోజూ 3,089 కేసులను అంబులెన్స్‌‌లు డీల్ చేస్తున్నాయి. ఎక్కువగా మహిళలు, కిడ్నీ బాధితులు, రోడ్డు ప్రమాద బాధితులు అంబులెన్స్ సేవల్ని పొందుతున్నారు.