సుబ్బారెడ్డికి భట్నాగర్‌ అవార్డు

సుబ్బారెడ్డికి భట్నాగర్‌ అవార్డు

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ అండ్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌ డయాగ్నోస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) సంస్థలో సైంటిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్‌ మద్దిక సుబ్బారెడ్డి దేశంలోని అత్యున్నత సైన్స్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. సెల్‌ బయాలజీలో చేసిన పరిశోధనలకుగాను ఆయన్ని ‘2022-శాంతి స్వరూప్‌ భట్నాగర్‌’ పురస్కారం వరించింది.  సాధారణ, క్యాన్సర్‌ కణాల జీవక్రియలపై ఆయన అధ్యయనం చేశారు. 2022 ఏడాదికిగాను 12 మందికి ‘భట్నాగర్‌’ పురస్కారం వరించింది. జీవశాస్త్రం, రసాయనం, గణితం, ఇంజినీరింగ్‌.. మొదలైన ఏడు విభాగాల్లో అత్యుత్తమ పరిశోధనలు జరిపిన 45 ఏండ్లలోపు సైంటిస్టులకు ఏటా ఈ అవార్డులను, రూ.5 లక్షలు నగదు పురస్కారాన్ని కేంద్రం అందజేస్తున్నది.