బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఆర్బీఐ రూ.5 కోట్ల జరిమానా
ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ మొత్తంలో జరిమానా విధించింది. చిరిగిన నోట్ల మార్పిడికి (soiled note remittances) సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం కన్పించడంతో ఈ బ్యాంక్కు ఆర్బీఐ రూ.5 కోట్ల పెనాల్టీ వేసింది. అంతేకాకుండా చిరిగిన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన రిజర్వ్ బ్యాంక్.. బీవోబీకి అదనంగా మరో రూ.2,750 వడ్డించింది. డిసెంబర్ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానా విధించినట్లు బీవోబీ వెల్లడించింది.