బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాపై ఆర్బీఐ రూ.5 కోట్ల జరిమానా

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాపై ఆర్బీఐ రూ.5 కోట్ల జరిమానా

ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ మొత్తంలో జరిమానా విధించింది. చిరిగిన నోట్ల మార్పిడికి (soiled note remittances) సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం కన్పించడంతో ఈ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ.5 కోట్ల పెనాల్టీ వేసింది. అంతేకాకుండా చిరిగిన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన రిజర్వ్‌ బ్యాంక్‌.. బీవోబీకి అదనంగా మరో రూ.2,750 వడ్డించింది. డిసెంబర్‌ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానా విధించినట్లు బీవోబీ వెల్లడించింది.