హైదరాబాద్ మెట్రోకు అరుదైన గుర్తింపు
హైదరాబాద్ మెట్రో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవార్డుల పోటీల్లో ఫైనల్ లిస్ట్లో చోటు దక్కించుకున్నదని ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి జూన్ 22న వెల్లడించారు. స్పెయిన్లోని బార్సిలోనాలో జూన్ 4 నుంచి 7 వరకు యూఐటీపీ గ్లోబల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎలివేటింగ్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్, ఇండియాపై అందించిన నామినేషన్ ఫైనల్ లిస్ట్లో హైదరాబాద్ ఎల్అండ్టీ మెట్రో రైల్ ఒకటిగా నిలిచింది. మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ కేటగిరీ కింద వచ్చిన 500 నామినేషన్లలో షార్ట్ లిస్ట్ చేశారు.