ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023
ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను ఎమ్మెల్సీ కవిత జూన్ 21న అందజేశారు. రూ.1,01,116 నగదుతో పాటు స్వర్ణ కంకణాన్ని తొడిగి సత్కరించారు. భారత జాగృతి ప్రదానం చేసే తొలి అవార్డును గోపి అందుకున్నారు. ఇప్పటివరకు ఆయన 56 పుస్తకాలు రచించారు. అందులో 26 కవితా సంకలనాలు, 7 వ్యాస సంకలనాలు, 5 అనువాద గ్రంథాలు ఉన్నాయి.