బీవోబీ ఎండీ, సీఈవోగా దేవదత్త చంద్‌

బీవోబీ ఎండీ, సీఈవోగా దేవదత్త చంద్‌

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా దేవదత్త చంద్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహించిన సంజీవ్‌ చద్దా నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2021 నుంచి బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న దేవదత్త చంద్‌ ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు. ఈ నియామకానికి అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆఫ్‌ ది క్యాబినెట్‌ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.