బీవోబీ ఎండీ, సీఈవోగా దేవదత్త చంద్
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా దేవదత్త చంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహించిన సంజీవ్ చద్దా నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2021 నుంచి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దేవదత్త చంద్ ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు. ఈ నియామకానికి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.