గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని రాజ్ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఆ విగ్రహం 12 అడుగులు ఉంది. మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే ప్రపంచ శాంతి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఢిల్లీలో గాంధీ స్మారకం ఉన్న రాజ్ఘాట్కు సమీపంలోనే గాంధీ దర్శన్ ఉంది.