World Cup 2023 15 మందితో పేర్ల‌ను ప్ర‌క‌టించిన చీఫ్ సెలెక్ట‌ర్‌

World Cup 2023 15 మందితో  పేర్ల‌ను ప్ర‌క‌టించిన చీఫ్ సెలెక్ట‌ర్‌

ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం టీమిండియా జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. 15 మంది స‌భ్యుల‌తో ఉన్న బృందాన్ని చీఫ్ సెలెక్ట‌ర్ అగార్క‌ర్ ప్ర‌క‌టించారు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీ చేయ‌నున్నాడు. ఇక టాప్ ఆర్డ‌ర్‌లో శుభ‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజా ఉన్నారు. బౌల‌ర్ల జాబితాలో శార్దూల్ ఠాకూర్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌, ష‌మీ, అక్ష‌ర్ ప‌టేల్ ఉన్నారు. ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌ల‌కు కూడా ఆ బృందంలో చోటు క‌ల్పించారు.