ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం
ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం దక్కింది. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ) లభించడంతో ఆత్రేయపురం కీర్తి జాతీయస్థాయికి చేరింది. ఈ నెల 15న విశాఖపట్నం దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆత్రేయపురం పూతరేకులకు ‘గ్లోబల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ సర్టిఫికెట్’ ప్రదానం చేసింది.