జీ20 వేదికపై కరీంనగర్కు అరుదైన గౌరవం
భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్సులో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల కళాత్మకం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా కరీంనగర్ హస్తకళల సంక్షేమ సంఘంలోని సిల్వర్ ఫిలిగ్రీ నాలుగు నెలల క్రితమే కేంద్రం నుంచి ఈ తయారీ ఆర్డర్ను పొందింది. ఇందులో భాగంగానే సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు 200 అశోక చక్ర బ్యాడ్జీలను తయారు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. జీ20 సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఒక స్టాల్ను ఏర్పాటు చేసుకునేందుకు వారికి అనుమతి లభించడం మరో విశేషం.