జయరాజ్‌కు కాళోజీ పురస్కారం

జయరాజ్‌కు కాళోజీ పురస్కారం

పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికిగాను ప్రముఖకవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌ అందుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రభుత్వం ప్రతి ఏడాది అవార్డు అందిస్తుంటుంది. ఈ నెల 9న కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో జయరాజ్‌కు ‘కాళోజీ’ అవార్డు అందిస్తారు. అవార్డు కింద రూ. 1,01,116 నగదు రివార్డు, జ్జాపిక అందించి శాలువతో సత్కరిస్తారు.
మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన జయరాజ్‌  చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళితకుటుంబానికి చెందిన జయరాజ్‌ వివక్షలేని సమాజం కోసం కృషి చేశారు.