ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు ప్రతిష్టాత్మక అవార్డు
ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక చెవలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డు లభించింది. ఫ్యాషన్ పరిశ్రమకు అందించిన సేవలకు గాను మిశ్రాకు అవార్డును ఫ్రాన్స్ అందచేసింది. కళలు, సాంస్కృతిక రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డులు బహుకరిస్తారు. గతంలో నటుడు కమల్ హాసన్, ఫిల్మ్ మేకర్ గునీత్ మోంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.