ఐఈటీ అధ్యక్షుడిగా గోపీచంద్‌ కాట్రగడ్డ

ఐఈటీ అధ్యక్షుడిగా గోపీచంద్‌ కాట్రగడ్డ

అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ ఇంజినీరింగ్‌ సంస్థ అయిన ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఈటీ) అధ్యక్షుడిగా ఐటీ రంగ ప్రముఖుడు డాక్టర్‌ గోపీచంద్‌ కాట్రగడ్డ నియమితులయ్యారు. డీప్‌ టెక్‌ స్టార్టప్‌ మైలిన్‌ ఫౌండ్రీ వ్యవస్థాపకుడైన ఆయన 142 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఐఈటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి భారతీయుడు. అక్టోబర్‌ 1 నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. హడ్డర్స్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ సీఈవో, వైస్‌-చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బాబ్‌ క్రయాన్‌ నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) రంగంలో అత్యంత గౌరవప్రదమైన నాయకుడిగా విరాజిల్లుతున్న డాక్టర్‌ కాట్రగడ్డ ఐఈటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండటం ఎంతో ముదావహమని ఆ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, సెక్రటరీ ఎడ్‌ అల్మండ్‌ పేర్కొన్నారు.