మెరైన్ రోబో.. అభివృద్ధి చేసిన ఐఐటీ పాలక్కడ్ పరిశోధకులు
నీటి లోపల నిఘా కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మండి, ఐఐటీ పాలక్కడ్కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుకు DRDO యొక్క నావల్ రీసెర్చ్ బోర్డ్ పాక్షికంగా నిధులు సమకూర్చింది. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు సైతం చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు. ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా, అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తున్నది.