ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకీరామన్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకీరామన్ను జూన్ 20న కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో మూడేండ్లు ఉంటారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మహేశ్ కుమార్ జైన్ పదవీకాలం జూన్ 20తో ముగిసింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా పని చేస్తున్న జానకీరామన్ ఈ పదవికి నియమితులయ్యారు.