దేశ వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ ప్రాప్ ఈక్విటీ నివేదికలో వెల్లడించింది.
దీని కోసం 30 ద్వితీయ శ్రేణి నగరాల్లోని రియల్ ఎస్టేట్ ధరలను ఈ సంస్థ పరిశీలించింది.
ఈ నివేదిక ప్రకారం గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబరు మధ్య కాలంలో 25 ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు 65 శాతం వరకూ పెరిగాయి.
అదే సమయంలో 5 నగరాల్లో ధరలు తగ్గాయి. ఇళ్ల ధరలు బాగా పెరిగిన ద్వితీయ శ్రేణి నగరాల్లో జయపుర (65 శాతం), ఆగ్రా (58 శాతం), గుంటూరు (51 శాతం), మంగళూరు (41 శాతం), చండీగడ్ (34 శాతం) ఉన్నాయి.
అదే సమయంలో భోపాల్, మొహాలి, సోనేపట్, త్రివేండ్రమ్, మైసూర్ నగరాల్లో 28 శాతం వరకూ ధరల పతనం కనిపిస్తోంది.
గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఇళ్ల ధరలు ఆకర్షణీయంగా పెరిగాయి. ఒక చదరపు అడుగు నిర్మాణ స్థలం సగటు ధర గుంటూరులో రూ.3,429 నుంచి రూ.5.169కి పెరిగింది. ఆదేవిధంగా విశాఖపట్నంలో రూ. 5,821 నుంచి 7,5195కి, విజయవాడలో రూ.3,932 నుంచి రూ.4,743కు పెరిగినట్లు వివరించింది.
ఉత్తర భారతదేశంలోని నగరాలైన జయపుర, ఆగ్రా, చండీగడ్, భివాడి, ఇందౌర్ నగ రాల్లో ఇళ్ల ధరలు 20 శాతం నుంచి 65 శాతం వరకూ పెరిగినట్లు పేర్కొంది