ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ను కీలక పదవి
ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ను మరో కీలక పదవి వరించింది. ఐఐటీ ఇండోర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. వచ్చే మూడు సంవత్సరాలు ఆయన ఆ పదవిలో ఉండనున్నారు. ఇటీవల ఐఐటీ ఇండోర్ స్పేస్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనే కోర్సును ప్రవేశపెట్టింది. ఆ విభాగానికి శివన్ చీఫ్ గా వ్యవహరించనున్నారు. శివన్ 2018 నుంచి 2022 వరకు ఇస్రో ఛైర్మన్ గా ఉన్నారు. ఈయన హయాంలోనే చంద్రయాన్-2 ప్రయోగించారు.