ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ను కీలక పదవి

ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ను కీలక పదవి

ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ను మరో కీలక పదవి వరించింది. ఐఐటీ ఇండోర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. వచ్చే మూడు సంవత్సరాలు ఆయన ఆ పదవిలో ఉండనున్నారు. ఇటీవల ఐఐటీ ఇండోర్ స్పేస్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనే కోర్సును ప్రవేశపెట్టింది. ఆ విభాగానికి శివన్ చీఫ్ గా వ్యవహరించనున్నారు. శివన్ 2018 నుంచి 2022 వరకు ఇస్రో ఛైర్మన్ గా ఉన్నారు. ఈయన హయాంలోనే చంద్రయాన్-2 ప్రయోగించారు.