RBI గవర్నర్‌కు అరుదైన గౌరవం

RBI గవర్నర్‌కు అరుదైన గౌరవం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌(Shaktikanta Das)కు అరుదైన గౌరవం దక్కింది. క్లిష్ట సమయంలో ఆయన చేసిన సేవలకు గానూ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. ఈ ఏడాది గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కు ఏ ప్లస్ ర్యాంకు లభించింది. ఏ ప్లస్ ర్యాంకు ముగ్గురికి లభించగా, ఆ ముగ్గురిలో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ (Switzerland) సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ థామస్ జె జోర్డాన్, మూడో స్థానంలో వియత్నాం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎన్గుయెన్ థి హాంగ్ నిలిచారు. ఈ విషయాన్ని ఆర్బీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. శక్తికాంత దాస్ కు అరుదైన ఘనత దక్కడం పట్ల ఎంతో సంతోషిస్తున్నామని పేర్కొంది.