బీడీఎల్‌ డైరెక్టర్‌గా పీవీ రాజారామ్‌

బీడీఎల్‌ డైరెక్టర్‌గా పీవీ రాజారామ్‌

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) డైరెక్టర్‌ (ప్రొడక్షన్‌)గా పీవీ రాజారామ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన.. పృథ్వీ, ఆకాష్‌ తదితర క్షిపణుల తయారీలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ రంగంలో రాజారామ్‌కు 34 ఏండ్ల అనుభవం ఉన్నది. గతంలో బీడీఎల్‌ హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ యూనిట్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, యూనిట్‌ హెడ్‌గా కూడా విధులు నిర్వహించారు.