హైకోర్టు కొత్త పీపీగా రాజేందర్‌రెడ్డి

హైకోర్టు కొత్త పీపీగా రాజేందర్‌రెడ్డి

హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)గా ఎం.రాజేందర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మూడేండ్లపాటు లేదా ప్రభుత్వం జారీచేసే తదుపరి ఉత్తర్వుల వరకు రాజేందర్‌రెడ్డి ఆ పదవిలో కొనసాగుతారని న్యాయశాఖ కార్యదర్శి రేండ్ల తిరుపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజేందర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు.